ప్రభాస్ ప ఇండియా స్టార్ గా మారిన తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసింద ప్రెసెంట్ ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.అందులో సలార్ సినిమా ఒకటి.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.
హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.
ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో శృతి హాసన్ నటిస్తుంది.ప్రభాస్ తొలిసారి శృతి హాసన్ తో నటిస్తున్నాడు.
అందుకే ఫ్యాన్స్ ఈ జంట తెరమీద ఎలా ఉంటదా అని ఉహించు కుంటున్నారు.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయట.
ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట.
ఇక ఈ సినిమా నుండి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.ఈ సినిమా సెకండ్ వేవ్ తర్వాత ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఆ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
అయితే ఈ సినిమా షెడ్యూల్ పూర్తి అవవడంతో ప్రభాస్ శనివారం హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తుంది.కాస్త కూడా విరామం లేకుండానే ప్రభాస్ అప్పుడే సలార్ షూట్ లో కూడా జాయిన్ అయినట్టు తెలుస్తుంది.
సలార్ లేటెస్ట్ షూట్ ను రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేశారట ఇక్కడే ఒక వారం రోజులు షూటింగ్ జరపనున్నారని సమాచారం.ఈ షెడ్యూల్ లో హాయ్ వోల్టేజ్ ఇంటర్వెల్ బ్లాక్ ను తెరకెక్కించ నున్నాడట.ఈ ఇంటర్వెల్ బ్లాక్ భారీగా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్.మరి ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్ నీల్ ఇక సినిమాలో ప్రభాస్ ను ఏ అవతారంలో చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.