ప్రభాస్ ప్రెసెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.పాన్ ఇండియా స్టార్ అయినా ప్రభాస్ తన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
ప్రెసెంట్ ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.అందులో సలార్ సినిమా ఒకటి.
ఈ సినిమాను కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు.హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఉగ్రం సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.కెజిఎఫ్ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే.అందుకే ఈ సినిమాలో కూడా ప్రభాస్ ను మరొక లెవల్ లో చూపించ బోతున్నాడని అభిమానులు ఆశ పెట్టుకున్నారు.
ఇక ఈ సినిమా నుండి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.ఇప్పటికే ప్రభాస్ ను యాక్షన్ హీరోగా నిలబెట్టేందుకు భారీ సెట్స్ వేసి మరి యాక్షన్ సన్నివేశలను తీశారు.ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ను మైసూర్ లో సెట్స్ వేసి తెరకెక్కించారు.ఇక ఈ సెట్స్ వేసేందుకు ఇప్పటికే నిర్మాతలు భారీ ఖర్చు పెట్టారు.అయితే తాజాగా మరొక వార్త వైరల్ అయ్యింది.ఈ సినిమాలో డార్క్ థీమ్ కూడా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.
కథలో భాగంగా ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల కోసం డార్క్ థీమ్ లో షూట్ చేయాల్సి వచ్చిందట.దీని కోసం మ్యాట్రిక్స్, టెనెట్ కి వాడే బ్లాక్ టెంట్స్ వినియోగిస్తున్నారట.ఇవి చాలా ఖరీడైనవి కావడం వల్ల కేవలం వీటికోసమే లక్షలు ఖర్చు చేస్తున్నారట.డార్క్ థీమ్ షూట్ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది.ఈ సినిమాను 2022 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.