పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
అందులో ‘సలార్’ సినిమా ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.ఎందుకంటే ఈ సినిమా గురించి బయటకు వస్తున్నవార్తలు వింటున్న అభిమానులు చాలా ఎక్సయిట్ అవుతున్నారు.తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు, ఇంకా హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కమ్ ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల మనసును హత్తుకునే విధంగా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం.
ఈ సినిమా యాక్షన్ సినిమా అయినా కూడా ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కావలసినంత సెంటిమెంట్ సీన్స్ ను యాడ్ చేసినట్టు టాక్.ఈ ఎమోషనల్ సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయని టాక్.
ఇక ఈ వార్తలు విన్న డార్లింగ్ అభిమానులు సంతోషం పట్టలేక పోతున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చుస్తున్నారు.
ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్ కాబోతుందని అందరికి తెలిసిందే.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.ఇక ఈ సినిమా నార్త్ లోనే భారీ స్క్రీన్ లలో విడుదల కాబోతుంది.
దీంతో ఎన్ని రికార్డ్ లను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.