తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మాస్టర్’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి ముంబై బ్యూటీ సాక్షి శివానంద్ గురించి తెలియని వారుండరు.ఈ అమ్మడు అప్పట్లో తెలుగు హీరోయిన్లకి ఏ మాత్రం తీసిపోకుండా దీటుగా పోటీ ఇచ్చింది.
అంతేగాక టాలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తదితర హీరోలతో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను సాధించాయి.అయితే కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో ఈ అమ్మడు జీవితం లో జరిగినటువంటి సంఘటన కారణంగా సాక్షి శివానంద్ మూట ముల్లె సర్దుకొని ముంబైకి వెళ్లి పోయిందని గతంలో పలు వార్తలు వినిపించాయి.
అయితే అప్పట్లో సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ టాలీవుడ్ కి చెందినటువంటి ఓ ప్రముఖ హీరో కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.అయితే ఆ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో శిల్పా శివానంద్ కొంతమేర ఆరోగ్య పరిస్థితి బాగాలేక పోవడం, అలాగే ఆమె వ్యక్తిగత కారణాల వల్ల షూటింగ్ కి హాజరు కాలేక పోయిందట.
దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి హీరో తండ్రి కచ్చితంగా షూటింగ్ కి హాజరు కావాలని తెగేసి చెప్పినప్పటికీ శిల్పా శివానంద్ షూటింగ్ కు రాకపోవడంతో ఆగ్రహానికి గురైనటువంటి హీరో తండ్రి ఆమెను కొట్టాడని అప్పట్లో పలువురు తీవ్రంగా చర్చించుకున్నారు.దీంతో సాక్షి శివానంద్ తన చెల్లెలి పై చేయి చేసుకున్నటువంటి ఆ ప్రముఖ హీరో పై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ హీరో తన పలుకుబడి ఉపయోగించి కేసును కొట్టి వేయించాడట.
దీంతో ఈ అవమాన భారం భరించలేకపోయిన సాక్షి తన కుటుంబ సభ్యులతో కలిసి బాలీవుడ్ కి వెళ్ళిపోయిందని, ఇంక అప్పటి నుంచి టాలీవుడ్ సినీ పరిశ్రమకు చాలా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అంతేగాక ఆ హీరో చేసిన నిర్వాకం కారణంగా సాక్షి శివానంద్ తెలుగులో మళ్లీ సినిమాలు చేయలేదని కూడా పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకూ ఆ హీరో ఎవరన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.