టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి ధోనీపై సోషల్ మీడియా వేదికగా సెటైర్ల వర్షం కురుస్తోంది.ఆమె ధరించిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.
నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు సాక్షి.
తాజాగా సాక్షి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై నెటిజన్లు మండిపడుతున్నారు.
సాక్షి ఇటీవల తన స్నేహితురాలు, మాజీ కేంద్ర మంత్రి ప్రపుల్ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్ సంగీత్ కార్యక్రమానికి భర్త ధోనితో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్సును ఆమె ధరించింది.అయితే, ఇప్పుడు ఆ డ్రెస్సు ధరించినందుకు గాను సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ధోని భార్య సాక్షిని లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
చూడగానే ఆచ్ఛాదనం లేకుండా ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా ఆ డ్రెస్ ఉంది.వాస్తవానికి ఆ డ్రెస్ను స్కిన్ కలర్ వస్త్రంతో డిజైన్ చేయడంతో అది శరీరంలో కలసిపోయింది.వీటి ని చూసిన కొందరు.
డ్రెస్ సెన్స్ లేదంటూ తిట్టిపోశారు.ధోనీ మర్యాదను కాపాడే విధంగా నడుచుకోవాలని ఓ నెటిజన్ హితవు పలికాడు.
‘సాక్షి గారు మీరంటే గౌరవం.కానీ ఇలా దిగజారుడుగా కనిపించొద్దని మరో వ్యక్తి విజ్ఞప్తి చేశాడు.
భారీగా విమర్శలు చెలరేగుతుండడంతో సాక్షి అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు.అయితే భర్త ధోనీలాగే కూల్ అని పేరున్న సాక్షి.ఆయా కామెంట్లకు రియాక్ట్ కాకుండా ఉండిపోయారు.