దిషా అత్యాచారం హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని పోలీసులు నేడు ఉదయం ఎన్ కౌంటర్ చేసిన విషయం తెల్సిందే.ఎన్కౌంటర్ లో నలుగురు కూడా అక్కడిక్కడే మృతి చెందారు.
ఈ ఎన్కౌంటర్ ప్రధానంగా సజ్జనార్ నేతృత్వంలో జరిగిన విషయం తెల్సిందే.దాంతో సజ్జనార్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హీరో అయ్యాడు.
సజ్జనార్ గురించి తెలుసుకునేందుకు ఆయన గురించి గూగుల్ చేస్తున్నారు.నేడు ఉదయం నుండి కూడా సజ్జనార్ దేశ వ్యాప్తంగా ఇంటర్నెంట్ లో ట్రెండ్ అవుతున్నారు.
ఇలాంటి సమయంలో అసలు సజ్జనార్ ఎక్కడి వాడు, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటీ ఆయన సొంత ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఏంటీ అనే విషయాలపై అందరిలో ఆసక్తి ఉంది.సజ్జనార్ అసలు ప్రాంతం కర్ణాటకలోని అసుతి అనే చిన్న గ్రామం.
ఆ గ్రామంలో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది.తమ గ్రామస్తుడికి దక్కిన అరుదైన గౌరవంకు ప్రతి ఒక్కరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చుట్టు పక్కల గ్రామాల వారు కూడా సజ్జనార్ సొంత గ్రామంలోని ఇంటికి చేరుకుని అక్కడ వేడుక జరుపుకుంటున్నారు.సజ్జనార్ మా ప్రాంతం వాడు అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.