చంద్రబాబు, లోకేష్ ల పై సజ్జల సంచలన కామెంట్స్...

ప్రబుత్వంపై ఒక వర్గం విష ప్రచారం చేస్తోంది.పండోరాకు లీక్స్ కు సీఎం జగన్ కు ఏంటి ?.ఏ రాష్ట్రంలో ఏమి జరిగిన అది ఏపీకి ముడిపెడతారా ?మొన్న హెరాయిన్, నేడు పండోరా ప్రభుత్వానికి ముడి పెట్టాలని చూస్తున్నారు.ఒక వర్గం దుష్ప్రచారం చేస్తే మరొక వర్గం దీనిని వెనకుండి నడిపిస్తుంది.

 Sajjala Ramakrishsha Reddy Serious Comments On Lokesh And Chandrabbau Naidu, Cha-TeluguStop.com

టీడీపీ నేతలు అంతా సినిమా డైరెక్టర్లుగా మారారు.డ్రగ్స్ ఎక్కడ పట్టుబడిన వైసీపీ నేతలకు అంటగడుతున్నారు.

చంద్రబాబు, లోకేష్ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారేమోన్న అనుమానం కలుగుతోంది.ఏపీలో ఎప్పుడు ఇంత స్థాయిలో డ్రగ్స్ పై చర్చ జరగలేదు.వారి విషయలు బయటకు వస్తాయని చర్చను పక్కదారి పట్టిస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతుంది.పెద్ద మొత్తం డ్రగ్స్ పట్టుబడ్డ సమయంలో లోకేష్ దుబాయ్ ఎందుకు వెళ్లారు.

డ్రగ్స్ పై సీబీఐ, డిఆర్ఐ విచారించి అసలు విషయాన్ని రాబట్టాలిరెండేళ్లలో 2లక్షల 50వేళ గంజాయి ఎకరాల పంట సెబ్ సీజ్ చేసింది.

గత గంజాయి ఎంత సాగు అయ్యిందో టీడీపీ నేతలు చెప్పాలి టీడీపీ నేతల ఆరోపణల తరువాత వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డిని పిలిచి విచారించాం.

టీడీపీ నేతలది బూటకపు స్వభావం.చంద్రబాబు చెప్పే ప్రతిదీ అబద్ధమే.పండోరా పేపర్సులో జగన్ పేరుందని చంద్రబాబు ఎలా అనగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube