చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి..!!

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వ్యాక్సిన్ లకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇష్టానుసారం అయిన వ్యాఖ్యలు చేస్తూ కష్టకాలంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

 Sajjala Ramakrishnareddy Made Serious Comments On Chandrababu Naidu , Corona Vac-TeluguStop.com

గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు అండ్ కో సభ్యులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు.రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ.

వ్యవహరిస్తున్నారని తెలిపారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందేలా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.

అంటూ చంద్రబాబు పై సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు.

ఈ మహమ్మారి సమస్య దేశమంతటా ఉందని.

ఇలాంటి సమయంలో ప్రజలను జాగ్రత్త చేయాల్సింది పోయి.ఈ విధమైన రాజకీయ ఆరోపణలు చేయటం ఏ మాత్రం సరైన విధానం కాదు అని తెలిపారు.

వ్యాక్సిన్ ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడుతున్నట్లు ఇష్టానుసారమైన ఆరోపణలు చేస్తున్నారు, అసలు… వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని సజ్జల క్లారిటీ ఇచ్చారు.ఇంట్లో కూర్చుని జూమ్ వీడియో… సమావేశాలు పెట్టుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడం కోసం వ్యాక్సిన్ కొరత తీర్చడం కోసం జగన్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ ఉంది అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube