ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయి

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి తాడేపల్లి గూడెం సి‌ఎం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.ఈ సందర్భంగా ఆయన టి‌డి‌పి అధినేత చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశాడు.

 Sajjala Ramakrishna Reddy Press Meet In Tadepalli Gudem,ramatherdam,bjp, Ap-tdp,-TeluguStop.com

బాబు హయాంలో విజయవాడలో ఆలయాలను కూల్చివేశాడు.రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోవడానికి కారణం అయ్యాడు.

సదావర్తి భూముల సంఘటన మర్చిపోయారా అంటూ ప్రశ్నించాడు.ప్రతిపక్ష పార్టీలు మతపరమైన రాజకీయాలు చేస్తున్నాయి.

ఎవరు లేని నిర్మానుషమైన ప్రాంతాలను ఎంచుకొని దాడులు చేస్తున్నారు.రామతీర్థం యొక్క ఘటన కూడా ప్లాన్ ప్రకారమే జరిగింది.చంద్రబాబు కావాలనే మతపరమైన రాజకీయాలు చేస్తున్నారు.అలాంటి నీచ రాజకీయాలు ఒక్క చంద్రబాబు కు మాత్రమే సాధ్యం అవ్వుతాయి.

హిందువుల పార్టీ అనే ఏజెండా ఉన్న బి‌జే‌పినే రామతీర్థం విషయంలో ఆచితూచి అడుగువేస్తుంటే చంద్రబాబు మాత్రం బి‌జే‌పికి దగ్గరయ్యేందుకు ఆలయాల దాడులను అడ్డంపెట్టుకొని విమర్శలు చేస్తున్నాడు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని సజ్జల అన్నాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube