అమరావతి: పీఆర్సీ పై మూడో సారి మంత్రులు కమిటీ సమావేశం.మరోసారి హజరుకాని ఉద్యోగ సంఘాలు.
రెండు గంటలపాటు వేచి చూసిన మంత్రుల కమిటీ.ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.
మంత్రుల కమిటీ నుండి మూడు సార్లు చర్చలకు పిలిచాం.స్టీరింగ్ కమిటీ సభ్యుల నుండి స్పందన లేదు.
వస్తారనే ఎదురు చూసాం.మొన్నటి వరకు అధికారికంగా కమిటీ లేదన్నారు.
అధికారికంగా జీవో ఇచ్చినా చర్చలకు రాకపోవడం ఏంటి? మీరు ఎక్కడో కూర్చుని డిమాండ్స్ చేస్తే ఎలా కుదురుతుంది.
మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది.
సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఉద్యోగుల సమ్మె చేయడం విరుద్ధం.జీతాలు ప్రాసెస్ చేయకుండా ఉంటే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి.
మెట్టు దిగకపోతే ఏ సమస్యా పరిష్కారం అవ్వదు.జేఏసీలో ఉన్న సంఘాలు కాకుండా వేరే ఏ సంఘాల ప్రతినిధులు వచ్చిన మాట్లాడతాం.
ఉద్యోగ సంఘాల నేతలు చాలా ఇమ్మేచ్యూరిటీ గా ఆలోచిస్తున్నారు.ఉద్యోగులు మీరైనా మీ నాయకులకు చెప్పిండి.
సమస్య జఠిలం అవ్వకుండా పరిష్కరించుకోవాలి.
హెచ్ ఆర్ ఏ తగ్గిందో లేదో ఉద్యోగులు మా ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది.
మీడియాలో ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా కుదురుతుంది.పిఆర్సీకి అంగీకారం తెలిపి ఇపుడు మళ్లీ సమ్మె అనడం ఏంటో ఉద్యోగ సంఘాలు ఆలోచించుకోవాలి.