ఏపీలో నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.రోజు రోజుకు వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు ముదురుతున్నాయి.
ఇప్పటికే ఒకరి మీద ఒకరు విపరీతంగా ఆరోపణలు చేసుకుంటూ దూషించుకుంటున్న సందర్భాలున్నాయి.
కాగా తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న నేపధ్యంలో, వైసీపీ కీలక నేతలపై, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడుతున్నారట.
కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఓటమిపాలైన తర్వాత చంద్రబాబులో చాలా మార్పులు వచ్చాయని, జుగుప్సాకరమైన భాషను వాడుతూ, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని సజ్జల ఆరోపిస్తున్నారు.
అంతే కాకుండా హత్యా రాజకీయాలను నడుపుతున్న చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారని దుయ్యబట్టారు.
ఆయన ప్రవర్తన దృష్ట్యా ఎవరైనా మనస్తాపానికి గురై, ఏ తీరుగా అయినా ప్రతిస్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వివాదానికి ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొన్నారు.