350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ‘సాహో’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.బాహుబలిని మించేలా ఉండాలని ఆ సినిమా బడ్జెట్ను అయితే దాటించారు.
కాని ఫలితం విషయంలో మరీ దారుణమైన ఫ్లాప్ను చవి చూడటం జరిగింది.అంత బడ్జెట్ ఎందుకు ఈ చిత్రానికి పెట్టారో ఎవరికి అర్థం కాని విషయం.
అత్యంత విచారకర విషయం ఏంటీ అంటే సాహో చిత్రం కనీసం 100 కోట్ల వసూళ్లను అయినా సాధిస్తుందా లేదా అనే అనుమానాలను ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
సాహో చిత్రం నష్టం కనీసం 150 నుండి 200 కోట్ల వరకు ఉంటుందని అంచనాకు వస్తున్నారు.ఇక సాహో విడుదల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం మేకర్స్లో ఆందోళన మొదలైనట్లుగా అనిపిస్తుంది.ఈ చిత్రంను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు సాహో ఫలితం తర్వాత ఏమాత్రం డేర్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.అసలు సైరా చిత్రం విడుదల విషయంలోనే పలు రకరాల అనుమానాలు వ్యక్తం అవుతున్నారు.
సైరా చిత్రంకు దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ పెట్టినట్లుగా తెలుస్తోంది.చిరంజీవికి ఇది చాలా ఎక్కువ బడ్జెట్ అని మెగా ఫ్యాన్స్ స్వయంగా అంటున్నారు.ఒక తెలుగు సినిమా 100 కోట్లకు బడ్జెట్ మించితే రిస్కీ ప్రాజెక్ట్ అనుకోవాలి.ఎవరో ఒకరు మాత్రమే ఆ భారీ బడ్జెట్ను రికవరీ చేయగలుగుతున్నారు.సాహో ఎఫెక్ట్ కారణంగా సైరా సినిమాకు సైతం క్రేజ్ తగ్గే అవకాశం ఉంది.తప్పకుండా సైరా విషయంలో కొత్త పద్దతి ఏమైనా పాటించి పబ్లిసిటీ చేయాలి.
లేదంటే ఓపెనింగ్స్ విషయంలో కూడా సైరాకు నిరాశ మిగిలే ఛాన్స్ ఉందని టాక్ వస్తుంది
.