టాలీవుడ్ హైబ్రిడ్ రౌడీ పిల్ల సాయి పల్లవి పేరు వింటే చాలు.తన అభిమానులు ఫిదా అయిపోతుంటారు.
ఇక ఫిదా సినిమాలో నటించిన ఈ అమ్మడు తన నటనతో అందర్నీ ఫిదా చేసింది.ఇక తెలుగు సినీ పరిశ్రమలో తన నటనకు మంచి గుర్తింపు అందుకని వరుస సినిమాలతో ఆఫర్ లను సొంతం చేసుకుంటుంది.
తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలో కూడా తన నటనతో అక్కడ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా విడుదలకు సిద్ధం అవగా కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది.అంతేకాకుండా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కనున్న విరాట పర్వం సినిమాలో హీరో రానా సరసన నటించింది.
ఇక ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది.ఇదిలా ఉంటే సాయి పల్లవి షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.
సాయి పల్లవి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండక పోయినా ఎప్పుడో ఒకసారి తన ఫోటోలతో తన అభిమానులను ఫిదా చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా ఈమధ్య వరుసగా ఫోటోలను బాగా షేర్ చేస్తుంది.ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా అందులో.సాయి పల్లవి పసుపు రంగు లాంగ్ ఫ్రాక్ వైట్ లో కనిపించగా.
ఇందులో ఎంత క్యూట్ గా తన స్మైల్ తో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకోగా.తెగ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే లవ్ స్టోరీ సినిమా వాయిదా పడగా విడుదల సమయాన్ని ఇంకా ప్రకటించలేదు.