స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట ఏప్రిల్ 1వ తేదీన కూడా విడుదల కాదని ఈ సినిమా వాయిదా పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే సర్కారు వారి పాట యూనిట్ మాత్రం రిలీజ్ డేట్ విషయంలో మార్పు ఉండదని చెబుతున్నట్టు తెలుస్తోంది.
సమ్మర్ లో చిరంజీవి, మహేష్ మధ్య పోటీ తప్పదని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
మరోవైపు త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
అయితే ఈ సినిమాలో మహేష్ బాబు చెల్లి పాత్ర ఉందని ఆ పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.సాయిపల్లవి మాత్రం అలాంటి తప్పు చేయరని అభిమానులు భావిస్తున్నారు.
స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రలో నటిస్తే ఆ హీరోయిన్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
మహేష్ కు జోడీగా సాయిపల్లవి నటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
మరి మహేష్ బాబుకు సాయిపల్లవి నిజంగానే చెల్లిగా నటిస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.కథ నచ్చితే మాత్రం సాయిపల్లవి ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి ఓకే చెబుతారని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.త్వరలో సాయిపల్లవి ఈ సినిమాలో నిజంగా నటిస్తున్నారో లేదో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
సాయిపల్లవి అభిమానులు మాత్రం ఈ వార్త నిజం కాకపోతే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కనుందని తెలుస్తోంది.ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు.
తొలి షెడ్యూల్ లో ఈ సినిమాలో ఫైట్ సీన్ తో పాటు సాంగ్ షూటింగ్ చేస్తారని తెలుస్తోంది.ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కు హీరోయిన్ ఫైనల్ కావాల్సి ఉంది.