బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి చేసిన ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఎంతో వివాదాస్పదంగా మారింది.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భాగంగా అతనిపై దాడి చేయడంతో దేశ ప్రధానికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అన్న విధంగా ఆ ఘటన పై స్పందిస్తూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్ కి సిద్ధార్థ్ స్పందిస్తూ…సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్… అంటూ తనపై చేసిన ట్వీట్ ఎంతో వివాదంగా మారింది.
ఈ క్రమంలోనే సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది ప్రముఖులు స్పందిస్తూ తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పై సైనా నెహ్వాల్ భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ట్విట్టర్లో సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా కశ్యప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… మీ అభిప్రాయాన్ని ఇలా తెలియజేయడం చాలా బాధాకరంగా ఉంది.
మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కానీ మంచి పదాలతో తెలియచేయండి అంటూ కశ్యప్ ట్వీట్ చేశారు.
ఈ విధంగా సైనా నెహ్వాల్ భర్త, సిద్ధార్థ్ వ్యాఖ్యలపై స్పందించడంతో సిద్ధార్థ్ తను చేసిన ట్వీట్ ద్వారా ఎవరిని అగౌరవపరిచ లేదు అంటూ వివరించే ప్రయత్నం చేశారు.ఇక సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఏకంగా కేంద్ర మంత్రులు జాతీయ మహిళా కమిషనర్, సింగర్ శ్రీపాద చిన్మయి వంటి వారు కూడా స్పందిస్తూ ఆయనపై విమర్శలు కురిపించారు.వెంటనే అతను చేసిన ట్వీట్ డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు.