పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ ను ప్రభాస్ బాగా ఉపయోగించుకుంటూ తన మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నాడు.
ప్రెసెంట్ ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.ఒకేసారి మూడు సినిమాలు సెట్స్ మీదకు తీసుకు వెళ్లి అన్ని సినిమాల షూటింగ్ ను బాలన్స్ చేస్తూ ప్రభాస్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.
అందులో ఆదిపురుష్ సినిమా కూడా ఉంది.
ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.
సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్నాడు.అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ పై బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ స్పందించారు.
ఈ సినిమా గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడారు.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ పై వస్తున్న గుసగుసలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఓటిటి లో రిలీజ్ అవ్వదని చెప్పారు.ఈ సినిమాను డైరెక్టర్ ఓం రౌత్ భారీ స్థాయిలో చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడని ఇది ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ మీద చూసే విధంగా ఉంటుందని తెలిపాడు.
ఈ సినిమా చిన్న స్క్రీన్ మీద ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వదని ఇది విజువల్ వండర్ గా ఉంటుందని బిగ్ స్క్రీన్ మీదనే ఈ సినిమాను ఎంజాయ్ చేయాలని ఆయన ఇంటర్వ్యూలో తెలిపాడు.ఇక ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల బడ్జెట్ తో భారీగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి చేసుకుని మిగతా పార్ట్ కూడా శరవేగంగా తెరకెక్కిస్తున్నారు.