బాహుబలి సినిమాతో మన తెలుగు చిత్ర సీమ రేంజ్ ఏంటో అందరికి బాగా అర్ధం అయ్యింది.సౌత్ సినిమాలంటే చిన్న చూపు చూసే ధోరణి ఇప్పుడిప్పుడే మారుతుంది.
మన తెలుగు హీరోలు కూడా ఒక్కొక్కరిగా బాలీవుడ్ పై దండయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు.ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ లు కూడా సౌత్ సినిమాలు చేయడానికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు.
సౌత్ సినిమాలు రేంజ్ తెలిసిన తర్వాత ఇక్కడ సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆలోచించడం లేదు.ఇప్పటికే చాలా మంది యువ హీరోయిన్స్ తెలుగులో నటిస్తున్నారు.తాజాగా ఆ కోవకే చెందుతుంది.సాయి మంజ్రేకర్.
ఈ బ్యూటీ ప్రస్తుతం మేజర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో మేజర్ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా రియల్ లైఫ్ లో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతుంది.ఈ సినిమా మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.ఈయన ముంబై లో జరిగిన తీవ్రవాద దాడుల్లో దేశం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు.
ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ తో పాటు శోభితా దూళిపాళ్ల కూడా హీరోయిన్ గా నటిస్తుంది.
ఇది ఇలా ఉండగా ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది.
ఈమె సౌత్ సినిమాలు చేయడానికి ఆమె తండ్రి మహేష్ మంజ్రేకర్ కారణమట.తెలుగులో ఆఫర్ వచ్చినప్పుడు భాష తెలియని కారణంగా తెలుగు సినిమానా అనే సందేహం వచ్చింది అప్పుడు మా నాన్న తేరా మీద బాష కాదు మన నటనే మాట్లాడాలని చెప్పాడట.
అందువల్లే నేను సౌత్ సినిమాలు చేయడానికి ఒప్పుకున్నానని ఆమె తెలిపారు.