అడివి శేష్ హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మేజర్.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది.
ముంబై టెర్రర్ ఎటాక్ లో వీరమరణం పొందింన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ నటిస్తున్నాడు.
కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఈ సినిమా కథ మొత్తం ముంబై నేపధ్యంలో సాగుతూ ఉండటం కారణంగా, అక్కడ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన సినిమా షూటింగ్ షెడ్యూల్ వాయిదా వేస్తూ వచ్చారు.
అయితే మరల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ 3లో నటించి ప్రేక్షకుల్ని ఫిదా చేసిన సయీ మంజ్రేకర్ ని ముఖ్యమైన పాత్రకు ఎంపికయ్యారు.
వచ్చే నెలలో హైదరాబాద్లో జరిగే ఈ సినిమా చిత్రీకరణలో ఆమె పాల్గొననున్నారు. శోభిత దూళిపాళ్ల ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తుంది.వీలైనంత వేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా ఈ సినిమాని విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అడవి శేష్ కెరియర్ లో మరో మైలు రాయిగా ఈ సినిమా నిలబడిపోతుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఈ సినిమా తర్వాత అడవి శేష్ గూఢచారి సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు.ఈ సినిమా కూడా ఈ ఏడాది ఆఖరులో షూటింగ్ మొదలు పెట్టుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.