మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.కొంతకాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతమైన సాయిధరమ్ తేజ్ చిత్రలహరి, ప్రతిరోజు పండగే సినిమాల విజయాలతో సక్సెస్ బాట పట్టాడు.
ప్రస్తుతం ఈ యంగ్ హీరో సోలే బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో పాత్ర గురించి చెబుతూ ట్విట్టర్ వేదికగా సాయిధరమ్ తేజ్ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.
సాయిధరమ్ తేజ్ తన గుండె పగిలిందని.ఒక అమ్మాయి తనకు హ్యాండ్ ఇచ్చిందని సినిమాలోని తన పాత్ర గురించి చెబుతూ పోస్ట్ చేశారు.అమృత తనను వదిలి వెళ్లిపోయిందని.ఇది నేనేనా అని ఆనందపడేలోపు తను దూరమైందని.
నా బాధ పాట రూపంలో వ్యక్తం చేస్తున్నానని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.అక్టోబర్ 15వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ పాట విడుదలవుతుందని చెప్పారు.
శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.సినిమాలోని సాయిధరమ్ తేజ్ తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పబోతున్నాడు.నిజ జీవితంలో బ్రేకప్ అయిన వాళ్లను ఈ పాట బ్రేకప్ ఆంథమ్ లా ఉంటుందని ఈ చిత్ర యూనిట్ చెబుతోంది.
చాలా నెలల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా కరోనా, లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
మొదట ఈ చిత్ర నిర్మాతలు సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేద్దామని భావించినా సినిమా థియేటర్లు త్వరలో తెరుచుకుంటున్న నేపథ్యంలో థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఓటీటీలలో విడుదలైన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండటంతో ఈ సినిమా నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ వైపే మొగ్గు చూపుతున్నారు.ఈ నెల చివరి వారం ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.