రేయ్ సినిమాతో హీరోగా మొదలుపెట్టిన సాయిధరమ్ తేజ్ కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకోగా ఆ తరువాత మాత్రం వరుస ఫ్లాపులతో చతికిలపడ్డారు.ప్రతిరోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకుని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం రిపబ్లిక్ సినిమాలో నటిస్తుండగా దేవా కట్టా డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులతో పాటు థియేట్రికల్ హక్కులను కూడా జీ స్టూడియోస్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
ఏకంగా 40 కోట్ల రూపాయలకు జీ స్టూడియోస్ ఈ మూవీ హక్కులు తీసుకున్నట్టు సమాచారం.సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ హక్కులు కూడా జీ స్టూడియోస్ తీసుకున్న సంగతి తెలిసిందే.
రిపబ్లిక్ మూవీ హక్కులు షాకిచ్చే రేటుకు అమ్ముడయ్యాయని వస్తున్న వార్తలు సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ సంతోషానికి కారణమయ్యాయి.సినిమా పెట్టుబడితో పోలిస్తే నిర్మాతలకు భారీగా లాభం వచ్చినట్టు తెలుస్తోంది.
జూన్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.మరోవైపు ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్లు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది.
టీజర్ తో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.అయితే మేకర్స్ క్లారిటీ ఇస్తే మాత్రమే ఈ సినిమా థియేటర్లలో రిలీజవుతుందో లేక ఓటీటీలో రిలీజవుతుందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా సాయిధరమ్ తేజ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.