టాలీవుడ్ లో నెంబర్ వన్ దర్శకుల్లో ఒకరు గా నిలిచే మారుతి కో ప్రొడ్యూసర్ గా కెరియర్ మొదలుపెట్టి నిదానంగా తెలుగు ఇండస్ట్రీ లో పాపులర్ డైరక్టర్ గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.తొలుత చిన్న చిన్న సినిమా లతో ప్రేక్షకులకు దగ్గరైన మారుతి నిదానంగా పెద్ద పెద్ద హీరో లతో కూడా సినిమాలు చేసి ఒక మంచి దర్శకుడిగా నిలిచాడు.
ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో,బస్ స్టాప్,కొత్త జంట,భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు ఇలా వరుసగా హిట్ అయిన విషయం విదితమే.ఐతే ఇప్పుడు మారుతి దర్సకత్వంలో మెగా హీరో వర్క్ చేస్తున్నారు.
ఆ చిత్రమే ‘ప్రతి రోజు పండగే’.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగా ఫ్యామిలీ నటుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది.ప్రస్తుతం ఈ ఫస్ట్ లో తండ్రీకొడుకులు సత్యరాజ్, సాయి ధరమ్ తేజ్లు వర్షంలో వెళ్తుంటే.
తండ్రి సత్యరాజ్ చిన్న పిల్లాడిగా మారి గొడుగులో నుండి బయటకు వచ్చి వర్షంలో తడుస్తూ చిందులేస్తున్నాడు.‘వర్షంలో డ్యాన్స్ చేయడానికి మీకు వయసుతో సంబంధం లేదు’ అంటూ సాయి ధరమ్ తేజ్ తండ్రి ఉత్సాహాన్ని ఎంజాయ్ చేస్తూ ఆపే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ కు సంబందించిన పోస్టర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.మారుతి తన ప్రతి సినిమా లో హీరో కి ఎదో ఒక లోపం పెట్టె ఆయన ఈ సారి సాయి ధరమ్ తేజ్ కి ఎలాంటి లోపం పెట్టారా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.అయితే చిత్రలహరి చిత్ర ప్లాప్ తరువాత సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రం పైనే అన్ని హోప్స్ పెట్టుకున్నాడు.మరి ఏ మేరకు వీరిద్దరి కాంబినేషన్ అలరిస్తుందో అన్న విషయం తెలుస్తుంది.