నేటి రాత్రి నుంచి షిరిడీలో సాయి ఆలయం మూసివేత.. !

ఈ మాయదారి కరోనా ప్రజలను ఎన్ని ముప్పతిప్పలు పెడుతుందో కదా.! తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుంది.

 Shirdi Temple Closed , Shirdi, Sai Baba Temple, Closed, Tonight, Corona Effect-TeluguStop.com

ఇప్పటికే పేద మధ్యతరగతి బ్రతులు పూట గడవడానికి ఎన్నో తిప్పలు పడుతుండగా మళ్లీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆ తిప్పలు ఇంకా పెరిగేలా ఉన్నాయి.ఇప్పటికే లెక్కలేనన్ని కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతుండగా కొన్ని చోట్ల లాక్‌డౌన్ కూడా విధించారు.

మహారాష్ట్రలో అయితే కరోనా విసృతంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే కోవిడ్ వల్ల చాలా ఆలయాల్లో దర్శన వేళల్లో మార్పులు చేసారు.అయితే తాజాగా షిరిడీలోని బాబా ఆలయాన్ని సోమవారం రాత్రి 8 గంటల నుంచి తదుపరి ఆదేశాల వరకు మూసివేయనున్నట్లుగా ప్రకటించారు.

కాగా బాబా ఆలయంతో పాటు అక్కడి ప్రసాదాలయం, భక్త నివాస్‌ను కూడా మూసివేయనున్నట్లు వెల్లడించారు.

ఇకపోతే మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ, వారాంతరాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే.కాగా షిరిడీ ఆలయాన్ని తిరిగి ఎప్పటి నుంచి తెరుస్తారు అన్నది ఆలయ సంస్థాన్ భక్తులకు త్వరలో తెలియజేయనున్నదట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube