నటనకు కేరాఫ్ అడ్రస్ అయిన హీరోయిన్ సాయి పల్లవి.అందాల ఆరబోతకు దూరంగా నటనకు దగ్గరగా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తుంది ఈ అమ్మడు.
తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో తన హవా నడిపిస్తుంది సాయి పల్లవి.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన సాయి పల్లవి యాంకర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట.
ప్రస్తుతం టాలీవుడ్ టౌన్లో దీనికి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అసలేం జరిగిందంటే.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరు అయింది సాయి పల్లవి.ఈ క్రమంలోనే యాంకర్ సాయి పల్లవి ని మలయాళీ అని పిలవడంతో ఒక్కసారిగా అగ్గిమీదగుగ్గిలంలా మారిపోయింది సాయి పల్లవి.
తాను మలయాళీ ని కాదని తమిళ అమ్మాయి అని కోయంబత్తూర్లో పుట్టిపెరిగాను అంటూ మాటల తూటాలను సంధించింది.తనను ఇంకెప్పుడూ మలయాళీ అని పిలవద్దు యాంకర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట.
సాయి పల్లవి ఆగ్రహంతో ఒక్కసారిగా షాక్ అయిన యాంకర్ కాసేపటికి తేరుకుని సాయి పల్లవి అని పేరు పెట్టి పిలవడం తో అంతా సర్దుకుంది.ఇకపోతే సాయి పల్లవి ప్రస్తుతం రానాతో కలిసి విరాటపర్వంలో నటిస్తుండగా నాగచైతన్య తో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది.
ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.