టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో విరాటపర్వం చిత్రం మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో ఇప్పటికే ముందువరుసలో ఉంది.కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసుకున్న ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
ఇక ఈ సినిమా కంటెంట్ పరంగా మరో లెవెల్లో ఉంటుందని చిత్ర వర్గాల టాక్.పీరియాడికల్ సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.
తెలంగాణ ప్రాంతంలో 1990 నాటి పరిస్థితుల ఆధారంగా ఈ కథను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆమె నటన ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఆమె పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర క్లైమాక్స్లో చనిపోతుందని, ఆ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు కంటతడి పెట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది.
ఇప్పటికే సాయి పల్లవి పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని, రానా దగ్గుబాటికి సంబంధించిన కొంత షూటింగ్ మిగిలి ఉందని, లాక్డౌన్ పూర్తవ్వగానే షూటింగ్ను ముగించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా సాయి పల్లవి పుట్టినరోజును పురస్కరించుకుని ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ను ఇటీవల రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
సాయి పల్లవి చాలా సింపుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.నక్సల్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సామాజిక అంశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.