ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సాయి పల్లవి.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
తన డాన్స్ టాలెంట్ అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది.ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా అని అందరూ అనుకున్నారు.
అనుకున్నట్లుగానే అవకాశాలు కూడా భాగానే వచ్చాయి.అయితే ఆమె సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉండటంతో స్టార్ హీరోల సినిమాలకి దూరమైంది.
కంటెంట్ బేస్ కథలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది.ఈ నేపధ్యంలో ఆమె చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.
అయితే పాటల విషయంలో మాత్రం ఇండియాలోనే మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ గా ఏకంగా వంద కోట్ల మంది వీక్షకులు చూసిన పాటగా రౌడీ బేబీ సాంగ్ నిలిచింది.ఇలా తన డాన్స్ టాలెంట్ తోనే సాయి పల్లవి ఎక్కువగా పాపులర్ అవుతుంది.
ప్రస్తుతం ఆమె లవ్ స్టొరీ, విరాటపర్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ఇదిలా ఉంటే ఫిదా సినిమాలో శేఖర్ కమ్ముల సాయి పల్లవితో తెలంగాణ మాండలికంలో బూతు మాట చెప్పించాడు.అదే మాటని ట్రైలర్ లో ఉపయోగించాడు.దాంతో ఆ డైలాగ్ భాగా పాపులర్ అయ్యింది.
అలాగే సినిమా కూడా మంచి హిట్ అవ్వడానికి ఆ బూతు డైలాగ్ హైప్ తీసుకొచ్చింది.ఇప్పుడు వేణు ఊడుగుల కూడా విరాటపర్వం సినిమా కోసం సాయి పల్లవితో ట్రైలర్ లో ఒక బూతు డైలాగ్ చెప్పించాడు.
ట్రైలర్ చివర్లో ఈ డైలాగ్ ఉపయోగించాడు.నక్షలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో గిరిజన అమ్మాయి అయిన సాయి పల్లవి తనని వేధించే పోలీసులని తిట్టడానికి ఈ బూతు డైలాగ్ సినిమాలో ఉపయోగిస్తుంది.
బూతు డైలాగ్ ట్రైలర్ లో పెట్టడం వలన ఫిదా సినిమా హిట్ కావడంతో ఇప్పుడు విరాటపర్వం కూడా హిట్ అవుతుందనే సెంటిమెంట్ టాలీవుడ్ ట్రెండ్ అవుతుంది.దర్శకుడు పవర్ ఫుల్ కంటెంట్ ని తీసుకోవడంతో కచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.
ఈ సినిమాతో సాయి పల్లవిలో పూర్తిస్థాయి నటిని కూడా తెరపై చూడొచ్చని భావిస్తున్నారు.