టాలీవుడ్ లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి ప్రయత్నంలోనే అందరి మనసు దోచేసిన అందాల భామ సాయి పల్లవి.ఫిదా సినిమాలో ఆమె యాక్టింగ్, డాన్స్ టాలెంట్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు.
సౌత్ లో సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారెంటీ అని అందరూ భావించారు.ఆ తరువాత నానితో ఎంసిఏ సినిమా చేసింది.
అది కూడా హిట్ అయ్యింది.ఇక తమిళంలో ధనుష్ కి జోడీగా మారి2లో నటించింది.
ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ తో ఒక్కసారిగా యూత్ అందరూ సాయి పల్లవి ఫ్యాన్స్ అయిపోయారు.ఆమె డాన్స్ లు చూడటానికి అయిన సినిమాకి వెళ్లాలని ఫిక్స్ అయిపోయారు.
అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో అవకాశాలు వచ్చిన ఎంత పెద్ద హీరో అయిన పాత్ర నచ్చకపోతే మొహమాటం లేకుండా చేయనని సాయి పల్లవి చెప్పేస్తుంది.ఈ విషయాన్ని మీడియా ఇంటర్వ్యూలలో కూడా చాలా సార్లు చెప్పింది.
తనకి కాస్టింగ్ తో పని లేదని కథ, అందులో తన పాత్ర నచ్చితే చేస్తానని తెగేసి చెప్పింది.ప్రస్తుతం ఈ భామ విరాటపర్వం, లవ్ స్టొరీ సినిమాలు చేస్తుంది.
మరో వైపు నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.ఇదిలా ఉంటే ఇప్పుడు కమర్షియల్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సాయి పల్లవితో ఓ లేడీ ఒరియాంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
ఎప్పటి నుంచో మహిళా ప్రాధాన్యంగా ఉన్న కథతో సినిమా చేయాలని అనుకుంటున్నా అనిల్ ఇప్పుడు దానిని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు.సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ ఆఫర్ ని రిజక్ట్ చేసిన కూడా అనిల్ తన కొత్త సినిమా కోసం సాయి పల్లవినే ఎంపిక చేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమాకి సంబంధించి త్వరలో అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.