న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని నాని చూస్తున్నాడు.
అయితే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని చూసినా, అది సాధ్యపడకపోవడంతో ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా తరువాత పలు చిత్రాలను నాని లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే టక్ జగదీష్ చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగా, శ్యామ్ సింగ రాయ్ అనే మరో సినిమాను లైన్లో పెట్టాడు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా ఫిదా బ్యూటీ సాయి పల్లవితో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.
కాగా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఈ సినిమాలో సాయి పల్లవి ఓ నెగెటివ్ రోల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.గతంలో నానితో కలిసి ఎంసీఏ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ, ఆ సినిమాలో నానితో కలిసి చేసిన రొమాన్స్ అందరికీ తెలిసిందే.
వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటంతో ఈసారి వారు కలిసి చేసే సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కానీ సాయి పల్లవి నెగెటివ్ రోల్లో నటిస్తుందనే వార్తతో ప్రేక్షకులు స్టన్ అయ్యారు.
మొత్తానికి సాయి పల్లవి నెగెటివ్ రోల్ చేసేందుకు ఒప్పుకుందంటే, ఆ పాత్ర ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు.మరి శ్యామ్ సింగ రాయ్లో సాయి పల్లవి చేయబోయే పాత్ర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
ఇక ఈ సినిమాను దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ డైరెక్ట్ చేస్తుండగా సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.