దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఆచితూచి కథలను ఎంపిక చేసుకుని ఎంతో అద్భుతమైన చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలోకి సాయిపల్లవి సోదరిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే సాయిపల్లవి సోదరి పూజకన్నన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
చూడటానికి ఇద్దరు ఒకే పోలికలతో ఉండడంతో ఈమెకు కూడా అదే స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుందని చెప్పవచ్చు ఇకపోతే ఈమె తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.స్టంట్ డైరెక్టర్ సిల్వా దర్శకుడిగా చిత్తా రాయి సెవ్వనం అనే సినిమాను తెరకెక్కించారు.
ఇందులో సాయిపల్లవి సోదరి పూజ కన్నన్, సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు.దాదాపు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా చిత్రీకరణ పూర్తి తర్వాత ఈ సినిమాని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం భావించారు.ఈ క్రమంలోనే చిత్రబృందం డిసెంబర్ 3వ తేదీ జీ5 ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.ఇలా తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న పూజ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.