టాలీవుడ్ లో ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయ మయి ప్రేక్షకులను ఫిదా చేసింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.చేసింది కొన్ని సినిమాలు అయినా తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.
కథ నచ్చక పోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా నో అని చెప్పడం ఈ అమ్మడి స్టైల్.అందం, అభినయం, డాన్స్ ఇలా ప్రతి విషయంలో సాయి పల్లవికి సాటి మరే హీరోయిన్ రాదనే చెప్పాలి.
ఇటీవలే సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో తన నటనతో మరొకసారి సూపర్బ్ అనిపించింది సాయి పల్లవి.
ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంట సూపర్ అంటూ కామెంట్స్ వచ్చాయి.కరోనా తర్వాత లవ్ స్టోరీ సినిమాతోనే టాలీవుడ్ లో థియేటర్స్ కళకళ లాడుతున్నాయి.
అయితే ఈ బ్యూటీ చిరంజీవి సినిమా భోళా శంకర్ లో చిరుకి చెల్లెలి పాత్రలో ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే.అయితే సాయి పల్లవి ఇది రీమేక్ సినిమా అవ్వడంతో సింపుల్ గా నో అని చెప్పేసింది.
అయితే చిరు సినిమాలో ఆఫర్ వద్దన్నదని మెగా అభిమానులు సాయి పల్లవి మీద ట్రోల్స్ చేసారు.ఇటీవల చిరు లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా వచ్చిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో చిరు సాయి పల్లవి తన సినిమాలో నటించడానికి నో చెప్పడం మంచిదయ్యింది అని చెప్పాడు.ఎందుకంటే చిరు సాయి పల్లవితో స్టెప్పులు వేయాలనుకున్నాడట.కానీ చెల్లెలి పాత్రలో నటించాలని కోరుకోలేదట.అందుకే అలా అన్నాడు.అయితే సాయి పల్లవి వెంటనే స్పందించి రీమేక్ సినిమా అనే నేను నో చెప్పానని మరొక అవకాశం ఇవ్వలని కోరుకుంది.
ఇటీవల లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో సాయి పల్లవి మాట్లాడుతూ చిరంజీవి గారితో నటించడం కోసం వేచి చూస్తున్నానని.
ఆయన ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు ఓకే అని తెలిపింది.అంతేకాదు ఆయన సినిమా అయితే ఏ పాత్రకైనా ఓకే చివరకు ఐటెం సాంగ్ లో నటించడానికి అయినా ఓకే అన్నట్టు సాయి పల్లవి తెలిపింది.
దీంతో సాయి పల్లవికి చిరు సినిమాలో ఖచ్చితంగా అవకాశం వస్తుందని ఆమె నటిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.మరి ఈ మాటతో సాయి పల్లవి మెగా అభిమానుల కోపం అయితే కొంత తగ్గించిందనే చెప్పాలి.