డైరెక్టర్ శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ.అయితే ప్రస్తుతం ఈ సినిమాకు, ఇప్పటివరకు విడుదలకు ముందు ఏ సినిమాకు రానంత క్రేజ్ వచ్చింది.
ఈ క్రేజ్ కు సాయిపల్లవి, నాగ చైతన్య క్రేజీ కాంబినేషన్ ఒక కారణమైతే ఆ సినిమాలోని సారంగ ధరియా పాట వివాదం మరొక కారణం అని చెప్పవచ్చు.అయితే సారంగ ధరియా పాటకు సంబంధించి ఈ పాట తాను సేకరించానని, సుద్దాల అశోక్ తేజ నా అనుమతి లేకుండా శేఖర్ కమ్ముల సినిమాలో పాటను పాడించాడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అయితే డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించి ఈ పాటకు సంబంధించిన క్రెడిట్స్ సింగర్ కోమలికి ఇస్తామని, కొంత అమౌంట్ కూడా అందజేస్తామని అంతే కాకుండా లవ్ స్టోరీ సినిమా ఆడియో ఫంక్షన్ కి ఆహ్వానిస్తామని, ఆ పాటను తనతోనే స్వయంగా పాడిస్తామని శేఖర్ కమ్ముల తెలపడంతో ఈ వివాదం ముగిసింది.అయితే సారంగధరియా పాట మరొక్క రికార్డును సాధించింది.
ఇప్పటికీ ఈ పాట 50 మిలియన్ వ్యూస్ కు చేరుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది.సరికొత్తగా ఈ బీట్ ఉండడంతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది.