మలయాళ ‘ప్రేమమ్’ చిత్రంతో ఒక్కసారిగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది సాయి పల్లవి.ఆ చిత్రంలో ఆమె చేసిన పాత్రకు అంతా కూడా ఫిదా అయ్యారు.
ఆ తర్వాత ఆమె మలయాళం కంటే ఎక్కువగా తమిళం మరియు తెలుగులో నటిస్తూ వస్తుంది.తెలుగులో ఈమె ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేయడం జరిగింది.
టాలీవుడ్లో మొదటి చిత్రంతోనే సాయి పల్లవికి స్టార్ ఇమేజ్ దక్కించుకుంది.కాని ఆ ఇమేజ్ను ఆమె కాపాడుకోవడంలో విఫలం అవుతుంది.
హీరోలతో వివాదంతో ఆమె విమర్శల పాలు అవుతుంది.
ఫిదా విషయం పక్కన పెడితే ఎంసీఏ చిత్రం సమయంలో నానితో, కణం చిత్రం సమయంలో నాగశౌర్యతో, పడి పడి లేచే మనసు చిత్రం సమయంలో శర్వానంద్తో ఈ అమ్మడు గొడవ పడ్డట్లుగా స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇక ఈమెకు తెలుగులో ఛాన్స్ ఇచ్చిన దిల్రాజుకు హ్యాండ్ ఇచ్చింది.శ్రీనివాస కళ్యాణం చిత్రంలో రాశిఖన్నా స్థానంలో ఈమెను తీసుకోవాలని దిల్రాజు భావించాడు.
కాని సాయి పల్లవికి ఆ చిత్రంలో నటించడానికి ఇష్టం లేదు.శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించను అంటూ తేల్చి చెప్పి దిల్రాజుకు షాక్ ఇచ్చింది.
ఏ హీరోయిన్ అయినా దిల్రాజు బ్యానర్లో నటించాలని కోరుకుంటుంది.కాని ఈ అమ్మడు మాత్రం దిల్రాజు బ్యానర్లో వరుసగా రెండు సక్సెస్లు వచ్చిన తర్వాత మూడవ సినిమాకు నో చెప్పడం జరిగింది.
ఇలా ప్రతి విషయంలో కూడా తన హెడ్ వెయిట్ను చూపిస్తూ వస్తున్న సాయి పల్లవితో యువ హీరోలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.అందుకే ఈమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదని సినీ వర్గాల వారు అంటున్నారు.
తెలుగులో ఈమె నటిస్తున్నది ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా.ఆమద్య రెండు మూడు సినిమాల్లో ఈమెకు ఆఫర్ వచ్చినా కూడా కథ బాగాలేదని, దర్శకుడు ఫేమ్ కలిగి లేడు అంటూ వదిలేసింది.
ఇప్పుడు అవకాశాల కోసం వెదికినా దొరకడం లేదు.ఈమెను కొందరు టార్గెట్ చేసి అవకాశాలు రాకుండా చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రముఖ నిర్మాత మరియు హీరోలు ఇద్దరు ముగ్గురు అనుకుంటే సాయి పల్లవి టాలీవుడ్కు గుడ్ బై చెప్పేసినట్లే.ఇప్పుడు అదే జరుగుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
అతిగా ప్రవర్తించిన సాయి పల్లవి ఇప్పుడు ఆ ప్రభావంను ఎదుర్కొంటుందని తెలుస్తోంది.సాయి పల్లవి తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుందని భావించిన వారికి షాక్ ఇస్తూ మూడు నాలుగు సినిమాలతోనే చాప చుట్టేసే పరిస్థితి వచ్చేసింది.