టాలీవుడ్ మోస్ట్ యాస్పైరింగ్ హీరోయిన్ గా ప్రస్తుతం సాయి పల్లవి ఉంది.చేసినవి మూడు సినిమాలే అయినా కూడా సాయి పల్లవి హీరోయిన్ అంటే ఆ సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోతుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది.అందులో వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం ఒకటి కాగా, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో చైతూకి జోడీగా లవ్ స్టోరీ ఒకటి చేస్తుంది.
ఈ రెండు సినిమాల మీద మంచి బజ్ ఉంది.దీనికి ఒక కారణం సాయి పల్లవికి ఉన్న క్రేజ్ కూడా అని చెప్పాలి.
వీటితో పాటు ప్రస్తుతం చాలా సినిమాల విషయంలో సాయి పల్లవి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.తన రెండో హీరో నానితో శ్యామ్ సింగరాయ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరుగా కనిపించబోతుందని తెలుస్తుంది.
అలాగే పుష్ప, ఆచార్య సినిమాల కోసం కూడా సాయి పల్లవి పేరు వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామ మరో సారి కుర్ర హీరో శర్వానంద్ తో జత కట్టడానికి రెడీ అవుతుంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో పడిపడి లేచే మనసు సినిమాలో సాయి పల్లవి శర్వానంద్ తో జత కట్టింది.ఈ సినిమా హిట్ కాకున్నా సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.
ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని కిషోర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఆమెకి కథ కూడా నేరేట్ చేయడం జరిగిందని, ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తుంది.
అన్ని అనుకూలంగా జరిగితే త్వరలో ఈ కాంబినేషన్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
.