ప్రపంచంలో వివిధ రంగాలలో సంపన్నులు, అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న వారి జాబితాని ఫోర్బ్స్ మ్యాగజైన్ ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటుంది.అయితే ఈ ఫోర్బ్స్ జాబితాలో వచ్చిన వారి పేర్లు చూస్తే ఒక్కో సారి ఆశ్చర్యం వేస్తుంది.
కొంత మంది సెలబ్రిటీలు ఫోర్బ్స్ ప్రకటించిన జాబితా తప్పని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.ఏది ఏమైనా తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ మరో సారి సంపన్నుల జాబితా ప్రకటించింది.30 ఏళ్ల లోపు ఇండియా యూత్ లో అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న 30 మంది జాబితా విడుదల చేసింది.ఇందులో చాలా మంది ప్రముఖులు, యువ పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.
అలాగే యుట్యూబ్ స్టార్స్ కూడా ఉన్నారు.
అయితే ఊహించని విధంగా ఇండియన్ సినిమా నుంచి ఈ జాబితాలో సౌత్ క్రేజీ హీరోయిన్ సాయి పల్లవికి చోటు లభించింది.
ఆమె ఫోర్బ్స్ జాబితాలో 15వ స్థానం దక్కింది.ఈమె సినిమాలు తక్కువ చేసిన ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందని.
ఈ కారణంగా ఈమె ఆదాయం ఇతర హీరోయిన్స్ తో పోల్చుకుంటే ఎక్కువగా ఉందని ఫోర్బ్స్ అంచనా.ఏడాదిలో ఈ అమ్మడి ఆదాయం దాదాపుగా 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.
అయితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా ఉన్న పూజా హెగ్డే, అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న యంగ్ హీరోయిన్స్ కంటే సాయి పల్లవి ఎక్కువగా సంపాదిస్తుంది అంటే కాస్తా ఆశ్చర్యంగానే ఉన్న నమ్మాలని ఫోర్బ్స్ భావన.ప్రస్తుతం తెలుగులో ఈమె రెండు సినిమాలు చేస్తుంది.
ఆ రెండు కూడా ఎవరేజ్ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉన్న సినిమాలే మరి ఈమె ఆదాయం ముప్పై కోట్లు ఎలా సంపాదిస్తుంది అనేది వారికే తెలియాలి.