పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఎప్పుడెప్పుడు షూటింగ్ ముగించుకుని రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాతో పవన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా తరవాత తన నెక్ట్స్ చిత్రాలను ఇప్పటికే ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు పవన్.
ఈ క్రమంలో మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన అయ్యప్పనుమ్ కొషియుమ్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతలను యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్రకు అప్పగించారు చిత్ర యూనిట్.
ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్గా అందాల భామ సాయి పల్లవిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.
ఈ మేరకు ఆమెను సంప్రదింపులు కూడా చేసినట్లు వార్తలు వినిపించాయి.
అయితే ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి ఒప్పుకోలేదని, ఆమె ప్రస్తుతం ఓకే చేసిన ప్రాజెక్టులు పూర్తి చేశాకే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో పవన్ నటించే చిత్రాన్ని సాయి పల్లవి రిజెక్ట్ చేసిందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చిత్ర యూనిట్కే తెలియాలని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
మరి ఈ సినిమాలో పవన్ సరస హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనేది చూడాలి.