టాలీవుడ్ లో సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ లో ఇప్పుడు సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.స్టార్ హీరో సినిమా అయినా కంటెంట్ బాగుండి తన పాత్రకి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే ఈ అమ్మడు చేయడానికి ఒకే చెబుతుంది.
లేదంటే నిర్మొహమాటంగా ఆఫర్ ని రిజక్ట్ చేస్తుంది.అయినా కాని సాయి పల్లవి అంటే ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.
ప్రస్తుతం ఈ అమ్మడు లవ్ స్టొరీ, విరాటపర్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.రెండు డిఫరెంట్ స్టొరీలతో పాటు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు కావడం విశేషం.
ఇక ఈ రెండు సినిమాల మీద భారీగా అంచనాలు ఉన్నాయి.వీటి తర్వాత పవన్ కళ్యాణ్ కి జోడీగా అయ్యప్పన్ కోశియమ్ సినిమాలో నటిస్తుంది అనే టాక్ ఉన్న అందులో ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదిలా ఉంటే సాయి పల్లవికి తెలుగునాట మంచి క్రేజ్ ఉంది.ఆమెని విపరీతంగా ఫాలో అయ్యే వారు ఉన్నారు.
ఈ నేపధ్యంలో తాజాగా ఆమె కొత్త సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.స్టార్ హీరో బాలకృష్ణకి కూతురుగా సాయి పల్లవి కనిపించబోతుందని చర్చ నడుస్తుంది.
ఓ యంగ్ దర్శకుడు రీసెంట్ గా బాలకృష్ణకి ఓ కథని నేరేట్ చేసాడని, ఆ కథ విన్న బాలయ్య వెంటనే ఒకే చెప్పెసాడని తెలుస్తుంది.ఈ సినిమా ఓ తండ్రి కూతుళ్ళ మధ్య ఎమోషనల్ ఎలిమెంట్ తో ఉంటుందని బోగట్టా.
ఇక ఈ కథలో కూతురు పాత్ర చాలా కీలకంగా ఉండటంతో దాని కోసం సదరు దర్శకుడు సాయి పల్లవిని సంప్రదించడం జరిగిందని తెలుస్తుంది.ఆమె కూడా స్టొరీ లైన్ విని పూర్తి కథ రెడీగా ఉంటే త్వరలో వింటానని చెప్పినట్లు బోగట్టా.
మరి నిజంగా ఈ రకమైన కాంబినేషన్ సెట్ అయితే టాలీవుడ్ లో కచ్చితంగా అదొక ట్రెండ్ సెట్టర్ అవుతుంది.మరి దీనిలో క్లారిటీ ఏంటి అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.