ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న నటి సాయి పల్లవి.ఆ సినిమా తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలంగాణ మాండలికంతో అందరి హృదయాల్ని ఫిదా చేసి ఆరాధ్య నటిగా మారిపోయింది.
ప్రస్తుతం ఉన్న నటీమణులలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరంటే సాయి పల్లవి అని చెప్పే గుర్తింపు తెచ్చుకుంది.ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సాయి పల్లవికి వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి.
అయితే వాటిలో అన్ని రకాల పాత్రలని అంగీకరించకుండా మనసుకి నచ్చే పాత్రలు, సినిమాలు మాత్రమే చేస్తూ వస్తుంది.ప్రస్తుతం విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి పాత్ర మరోసారి అందరికి గుర్తుండిపోయే విధంగా ఉండబోతుందని ఇప్పటికే దర్శకుడు వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చేశారు.
ఇదిలా ఉంటే సాయి పల్లవి ప్రస్తుతం కోలీవుడ్ లో ఓ వెబ్ ఫిలింలో నటించింది.
నెట్ ఫ్లిక్స్ లో పావ కధైగళ్ టైటిల్ తో రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలో సాయి పల్లవి నటనకి నీరాజనాలు పడుతున్నారు.నాలుగు కథల సమాహారంగా నడిచే ఈ సినిమాలో సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ తండ్రి కూతుళ్లుగా నటించారు.ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ కలిసి నటిస్తే వారి మధ్య పోటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురు భర్తతో కలిసి ఉంటుంది.గర్భవతిగా ఉన్న కూతురు ఇంటికి వెళ్లి శ్రీమంతం చేస్తానని తండ్రి ఇంటికి తీసుకొచ్చి తన పరువు పోవడానికి కారణం అయ్యిందని విషం ఇచ్చి చంపేస్తాడు.
ఇక ప్రాణం పోయే స్థితిలో తండ్రిని కాపాడమని కూతురు వేడుకుంటుంది.హృద్యంగా సాగే ఈ ఎమోషనల్ ఎపిసోడ్ లో సాయి పల్లవి జీవించేసి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది.
కూతురు ప్రాణాలు పోతున్న చలించని తండ్రిగా ప్రకాష్ రాజ్ నటన కూడా అద్భుతంగా ఉంటుంది.ఈ వెబ్ ఫిల్మ్ మొత్తానికి సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ హైలెట్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ ని నేషనల్ అవార్డు ఇచ్చిన తక్కువే అవుతుందని ప్రశంసలు లభిస్తున్నాయి.ఈ ఎపిసోడ్ కి వెట్రి మారన్ దర్శకత్వం వహించాడు.