టాలీవుడ్లో ఫిదా చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ సినిమాతో ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే.ఆ సినిమా కేవలం సాయి పల్లవి వల్లే హిట్ అయ్యిందని చాలా మంది అంటారు.
అంతలా మ్యాజిక్ చేసిన ఈ బ్యూటీ, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.వరుసగా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలుస్తుండటంతో ఆమె టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది.
ఇక సాయి పల్లవి చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.కాగా ఈ సినిమాల్లో ఆమె ఒకే రకమైన పాత్రలో నటిస్తూ వస్తోంది.
దీంతో ఆమె చేస్తున్న పాత్రలు ప్రేక్షకులకు బోర్ కొట్టేశాయి.ఆమె కొత్తదనం లేని పాత్రలు చేస్తుండటంతో ఆమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రావడం లేదు.
కాగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న విరాటపర్వం చిత్రంలోనూ ఆమె ఫస్ట్ లుక్ను ఇటీవల రిలీజ్ చేయగా, అందులో కూడా ఆమె లంగా వోనితో దర్శనమిచ్చింది.ఇక సాయి పల్లవి నటిస్తోన్న మరో సినిమాలో కూడా ఇదే తరహా పాత్రలో నటిస్తోందట.
నేచురల్ స్టార్ నాని నటించబోయే ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంలో సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట.దీంతో మరోసారి రొటీన్ పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి ఇప్పటికైనా వెరైటీ పాత్రల్లో నటించాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఇక విరాటపర్వం సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.