ఫిదా చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ సినిమాతో అదిరిపోయే సక్సెస్ను అందుకుంది.ఆ సినిమా అందించిన సక్సెస్తో వరుసబెట్టి సినిమాలు చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతుంది ఈ బ్యూటీ.
చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలుస్తుండటంతో ఆమెను తమ సినిమాల్లో తీసుకునేందుకు స్టార్ హీరోలు ఎక్కువగ ఆసక్తి చూపుతున్నారు.
ఇక తెలుగుతో పాటు తమిళంలోనూ తన స్తతా చాటుతూ వరుసబెట్టి సినిమాలను చేస్తూ సాయి పల్లవి దూసుకుపోయింది.
ముఖ్యంగా స్టార్ హీరో ధనుష్ సరసన మారీ-2 చిత్రంలో రెచ్చిపోయి నటించిన సాయి పల్లవి, ఆ తరువాత మరో స్టార్ హీరో సూర్య సరసన ఎన్జీకే చిత్రంలో కూడా నటించింది.అయితే ఈ రెండు సినిమాలు కూడా తమిళనాట ఫ్లాప్ చిత్రాలుగా నిలిచాయి.
దీంతో అమ్మడిని తమిళ తంబీలు ఓ రేంజ్లో ఏసుకున్నారు.ముఖ్యంగా మారీ-2 చిత్రం ఫ్లాప్ కావడానికి సాయి పల్లవియే కారణమంటూ గాసిప్ రాయుళ్లు ఆమెను తెగ ట్రోల్ చేశారు.
సాయి పల్లవి ఓవర్ యాక్టింగ్ వల్లే ఆ సినిమా పోయిందని వారు ఆమెపై మండిపడ్డారు.దీంతో తమిళ దర్శకనిర్మాతలు సాయి పల్లవితో సినిమా చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదట.
అయితే సాయి పల్లవి ఇవేమీ పట్టించుకోకుండా తెలుగులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్తోంది.కాగా ఇప్పటికే తెలుగులో విరాటపర్వం, లవ్స్టోరీ చిత్రాల్లో నటిస్తోంది.ఏదేమైనా సాయి పల్లవికి తమిళ నాట మారీ-2 చిత్రం ఆఫర్లు లేకుండా చేసిందని ఆమె అభిమానులు అంటున్నారు.