మలయాళి ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగులో ఫిదా చేసి వరుసగా చిత్రాలు చేస్తోంది.తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఈ అమ్మడి సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకు కూడా ఈ అమ్మడు కనీసం స్కిన్ సో చేయలేదు.నడుము లైట్గా చూపించడం మినహా ఇప్పటి వరకు ఈ అమ్మడు కనీసం నాభిని కూడా చూపించిన దాఖలాలు లేవు.
ఈమె చేసిన సినిమాల్లో స్కిన్ షోకు స్కోప్ ఉన్నా కూడా ఈమె మాత్రం నో చెబుతూ వచ్చింది.
తెలుగులో హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ చేస్తేనే ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది.
కాని సాయి పల్లవి మాత్రం అస్సలు గ్లామర్కు ఓకే చెప్పడం లేదు. చాలా బలవంతం మీద నాగ చైతన్యతో లవ్ స్టోరి చిత్రంలో ముద్దు సీన్ చేసిందట.
అది కూడా కథకు చాలా కీలకం అవ్వడం వల్ల శేఖర్ కమ్ములతో ఉన్న అనుబంధం కారణంగా ఓకే చెప్పిందట.ఈ విషయంలో సాయి పల్లవి సన్నిహితులు మాట్లాడుతూ ముద్దు సీన్ చేసినంత మాత్రాన ఇకపై స్క్రీన్పై గ్లామర్గా సాయి పల్లవి కనిపించబోతుందని అనుకుంటే పొరపాటే అంటున్నారు.
గతంలో సాయి పల్లవి మాదిరిగానే నిత్యా మీనన్ కూడా స్కిన్ షోకు అస్సలు ఒప్పుకోలేదు.తనకు ఇలాగే చేయడం ఇష్టం.ఇలా అయితే మీకు ఇష్టం ఉంటే ఛాన్స్ ఇవ్వండి లేదంటే లేదు అంటూ తేల్చి చెప్పేది.దాన్ని ఆమె పొగరు అని చాలా మంది అన్నారు.ఇప్పుడు సాయి పల్లవి కూడా అదే తరహాలో ప్రవర్తిస్తుంది. ఈ అమ్మడి తీరుపై దర్శక నిర్మాతలు అసహనంతో ఉన్నారు.
అయినా కూడా ఈమెకు ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు.