కరోనా సెకండ్ వేవ్ వల్ల పలు సినిమా లు విడుదల ముందు నిలిచి పోయాయి.చిన్న పెద్ద సినిమాలు కలిపి డజనుకు పైగా సినిమాలు విడుదల తేదీ ప్రకటించిన తర్వాత క్యాన్సిల్ అయ్యాయి.
అందులో ముఖ్యంగా లవ్ స్టోరీ మరియు విరాటపర్వం సినిమాలు ఉన్నాయి.ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ రెండు సినిమా ల్లో కూడా హీరోయిన్ గా సాయి పల్లవి నటించిన విషయం తెల్సిందే.ఈ రెండు సినిమా ల్లో సాయి పల్లవి నటన అద్బుతంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం సాయి పల్లవి చేస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అంటూ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలోనే సాయి పల్లవి ఇతర భాషల్లో కూడా నటిస్తూ ఉంది.
తెలుగు మరియు ఇతర భాషల్లో ఈమె నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సీఫీస్ ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి.
సెకండ్ వేవ్ ముగిసి థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే సినిమా లు బ్యాక్ టు బ్యాక్ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు కొన్ని జరుపుకుంటూ ఉంటే కొన్ని మాత్రం ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉన్నాయి.తెలుగు లో నాగచైతన్య తో చేసిన లవ్ స్టోరీ మొత్తం వర్క్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.
ఇక రానా తో కలిసి నటించిన విరాట పర్వం సినిమా చిత్రీకరణ ముగించుకుని విడుదలకు సిద్దం అయ్యింది.ఈ సినిమా తో పాటు నాని సినిమా శ్యామ్ సింగరాయ్ లో కూడా సాయి పల్లవి పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతుంది.
ఆ సినిమా లుక్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి బాబోయ్ అన్నట్లుగా టాక్ దక్కించుకుంది.అందుకే ఖచ్చితంగా మరోసారి సాయి పల్లవి సందడి షురూ అవుతుందని అంటున్నారు.