ఫిదా సినిమా తో అందర్నీ ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.ఆ సినిమాలో తన పాత్రలతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలు కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం సాయి పల్లకి టాలీవుడ్ లో ఎంతో క్రేజీ ఉంది.
అంతేకాకుండా స్టార్ హీరోల సరసన నటించింది.
ఇదిలా ఉంటే సాయి పల్లవికి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి.
ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న లవ్ స్టోరీ సినిమా లో హీరో నాగచైతన్య తో నటించిన సంగతి తెలిసిందే.హీరో నాని తో శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో నటిస్తుంది.
అంతేకాకుండా మరో స్టార్ హీరో రానా దగ్గుబాటి తో కలిసి విరాటపర్వం సినిమా చేస్తుంది.అంతేకాకుండా తమిళం, మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ పూజా హెగ్డే, రష్మిక మందన లతో పోల్చుతున్నారు.
ఇదిలా ఉంటే టాలీవుడ్ కు ఇటీవలే పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి.మొదటి చూపులోనే యువత మనసును దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఉప్పెన సినిమా తో పరిచయమైన ఈ నటి టాలీవుడ్ లో వరుస ఆఫర్ల ను దక్కించుకుంటుంది.
ఉప్పెన సినిమాలో విడుదలైన మొదటి పాటకే తన అందంతో బాగా ఆకట్టుకుంది.ప్రస్తుతం నానితో శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో నటిస్తోంది.కాగా కృతి శెట్టి కి అతి తక్కువ సమయంలోనే పూజా హెగ్డే, రష్మిక మందన లను మించిపోతుందని టాలీవుడ్ పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా కృతి శెట్టి మరో యంగ్ హీరో అఖిల్ సినిమాలో నటించనున్న వార్తలు వినిపిస్తున్నాయి.