యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు గోపీచంద్.కమర్షియల్ యాక్షన్ ఫార్ములా కథలతో ఎక్కువగా సినిమాలు చేస్తున్న గోపీచంద్ కి ఈ మధ్యకాలంలో లౌక్యం తర్వాత సాలిడ్ హిట్ పడలేదు.
ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జోడీగా సిటీమార్ అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి వచ్చేసింది.
కబడ్డీ నేపధ్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత గోపీచంద్ మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.
యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథని మారుతి సిద్ధం చేశాడు.ఇక పక్కా కమర్షియల్ అనే టైటిల్ ని ఈ సినిమాకి పెట్టినట్లు తెలుస్తుంది.
ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ మారుతి గత సినిమాల తరహాలోనే ఉండబోతుందని సమాచారం. ఇందులో కమర్షియల్ మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్ లో హీరో గోపీచంద్ కనిపిస్తాడని.
ప్రతిదానికి లెక్కలు కట్టే తరహాలో కాస్తా నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని టాక్.ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్ పాత్రకి కూడా మంచి ప్రాధాన్యత ఉండటంతో మారుతి టాలెంటెడ్ యాక్టర్ సాయి పల్లవి కోసం ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది.
ఎలా అయినా ఆమెని ఒప్పించాలని అనుకుంటున్నాడు.దానికోసం కథ చెప్పేందుకు సిద్ధం అయినట్లు టాక్.ఇక ఆమె కాకుంటే అనుపమ పరమేశ్వరన్ ని తీసుకోవాలని చూస్తున్నట్లు బోగట్టా.సాయి పల్లవి ప్రస్తుతం విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాలు చేసి ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యింది.
మరో వైపు అయ్యప్పన్ కోషియమ్ లో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తుందని టాక్.ఈ నేపధ్యంలో గోపీచంద్ జోడీగా నటించడానికి ఒకే చెబుతుందా అనేది చూడాలి.