సాయిపల్లవి కొంపముంచిన కరోనా

ఫిదా బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం వరుసగా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఇప్పటికే విరాటపర్వం, లవ్‌స్టోరి చిత్రాలను ఆమె రిలీజ్‌కు రెడీ చేస్తోంది.అయితే 2018లో కణం, పడ పడి లేచె మనసు అనే రెండు సినిమాలను తీసుకొచ్చిన సాయిపల్లవి ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగలడంతో 2019లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.

దీంతో 2020లో ఆమె వరుసగా సినిమాలు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యింది.ఈ క్రమంలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వంలో డీగ్లామర్ రోల్‌లో నటిస్తోంది.

ఇక ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సాయి పల్లవి లైన్‌లో పెట్టింది.

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన లవ్‌స్టోరి చిత్రాన్ని కూడా రిలీజ్‌కు రెడీ చేసింది.

ఈ సినిమాలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే 2020లో ఈ రెండు సినిమాలు రిలీజ్ చేయాలని సాయి పల్లవి భావించింది.

కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమాల ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి.

దీంతో ఈ సినిమాలపై భారీ నమ్మకాలు పెట్టుకున్న ఫిదా బ్యూటీకి ఈయేడు కూడా నిరాశే మిగిలింది.

మొత్తానికి కరోనా వైరస్ సాయి పల్లవి కొంప ముంచిందనేది వాస్తవం.ఇక విరాటపర్వం చిత్రంలో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తోండగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్‌కు ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : పెన్సిల్వేనియా ప్రైమరీలో ట్రంప్‌కు షాక్ .. నిక్కీహేలీదే విజయం