ఫిదా బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం వరుసగా టాలీవుడ్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఇప్పటికే విరాటపర్వం, లవ్స్టోరి చిత్రాలను ఆమె రిలీజ్కు రెడీ చేస్తోంది.
అయితే 2018లో కణం, పడ పడి లేచె మనసు అనే రెండు సినిమాలను తీసుకొచ్చిన సాయిపల్లవి ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగలడంతో 2019లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.దీంతో 2020లో ఆమె వరుసగా సినిమాలు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యింది.
ఈ క్రమంలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వంలో డీగ్లామర్ రోల్లో నటిస్తోంది.ఇక ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సాయి పల్లవి లైన్లో పెట్టింది.
ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన లవ్స్టోరి చిత్రాన్ని కూడా రిలీజ్కు రెడీ చేసింది.ఈ సినిమాలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే 2020లో ఈ రెండు సినిమాలు రిలీజ్ చేయాలని సాయి పల్లవి భావించింది.కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమాల ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి.
దీంతో ఈ సినిమాలపై భారీ నమ్మకాలు పెట్టుకున్న ఫిదా బ్యూటీకి ఈయేడు కూడా నిరాశే మిగిలింది.మొత్తానికి కరోనా వైరస్ సాయి పల్లవి కొంప ముంచిందనేది వాస్తవం.
ఇక విరాటపర్వం చిత్రంలో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తోండగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్కు ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.