‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి ఆ తర్వాత వచ్చిన ఎంసీఏ చిత్రంతో కూడా సక్సెస్ను దక్కించుకుంది.దాంతో సాయి పల్లవికి తెలుగులో మంచి గుర్తింపు దక్కడంతో పాటు, మంచి ఆఫర్లు వస్తున్నాయి.
కాని సాయి పల్లవి తన దుడుకు స్వభావం కారణంగా వివాదాలను ఎదుర్కొంటోంది.వరుసగా తాను నటిస్తున్న సినిమాల్లో ఎవరితోనో ఒకరితో వివాదం పెట్టుకుని కెరీర్ను నాశనం చేసుకుంటుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆమద్య నాగ్ అశ్విన్తో పెద్ద గొడవే జరిగిన విషయం తెల్సిందే.తాజాగా ఈమె నటిస్తున్న ‘పడిపడి లేచే మనసు’ చిత్ర యూనిట్ సభ్యులతో కూడా వివాదం పెట్టుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పడి పడి లేచే మనసు’ చిత్రం కొన్ని సీన్స్ను రీ షూట్ చేస్తున్నారు.రీ షూట్ కోసం సాయి పల్లవి డేట్లు అడిగిన చిత్ర యూనిట్ సభ్యులకు షాకింగ్ సమాధానం ఎదురైందట.ఇప్పటికే మీకు ఇచ్చిన డేట్లు పూర్తి అయ్యాయి.షూటింగ్ మొత్తం పూర్తి చేశాను.నా బాధ్యత పూర్తి అయ్యింది.
మళ్లీ షూటింగ్ అనేది మీ సమస్య.అందుకు నేను బాధ్యురాలిని కాదు.
నా వల్ల తప్పు జరుగకున్నా మళ్లీ నన్ను షూటింగ్కు రమ్మనడం పద్దతి కాదంది.రీ షూట్కు రావాలి అంటే మళ్లీ కొత్త ఒప్పందం చేసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేస్తోందట.
కొత్త ఒప్పందం ప్రకారం పారితోషికం మళ్లీ ఇవ్వాల్సి ఉంటుందట.అంటే తన పాత్రను తానే మరోసారి చేసేందుకు పారితోషికం డిమాండ్ చేస్తోంది.రీ షూట్కు రీ పారితోషికం అన్నమాట.ఈ విషయానికి షాక్ అయిన చిత్ర యూనిట్ సభ్యులు సరే ఏం చేస్తాం అనుకుని ఆమెకు మళ్లీ పారితోషికం ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.