నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ఈ నెల 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.ముందుగా అందరూ ఊహించిన విధంగానే ఈ సినిమా సక్సెస్ కావడంతో చిత్ర బృందం మొత్తం హైదరాబాద్ లోనూ ట్రైడెంట్ హోటల్లో చిత్రబృందం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సాయి పల్లవి నాగచైతన్య స్పెషల్ అట్రాక్షన్ కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున పాల్గొన్నారు.ఈ క్రమంలోనే సాయి పల్లవి మాట్లాడుతూ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మీరు వస్తారని అనుకున్నాను.
అప్పుడు వచ్చి ఉంటే ఈ విషయాలన్నీ అక్కడే మాట్లాడేదాన్ని అంటూ నాగార్జున గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న వారందరికీ స్పెషల్ థాంక్స్ చెబుతూ నాగార్జున గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలియజేశారు.తన తాతయ్య నాగార్జున గారు నటించిన అన్నమయ్య సినిమా ఒక వంద సార్లు చూశారని, ఆయన సినిమా చూడటంతో మేం కూడా చూశామని ఆ సినిమాలో నాగార్జున గారిని చూస్తూ తాతయ్య ఏడ్చాడు.అది చూసిన నేను ఇది సినిమా తాతయ్య అని చెప్పగా లేదు నాగార్జున గారు గత జన్మలో ఒక యోగి అయి ఉంటారని చెప్పారు.
ఇక అప్పటినుంచి టీవీలో నాగార్జున గారి సినిమా ఏది వచ్చినా నేను ఛానల్ మార్చేదాన్ని.ఎందుకంటే తాతయ్య దృష్టిలో నాగార్జున ఎప్పుడు యోగిగానే ఉండాలని అలా చేసేద్దానని ఈ సందర్భంగా సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజా వార్తలు