ఫిదా ఫేం సాయి పల్లవి నటించింది కొన్ని సినిమాల్లోనే అయిన కాని ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.ఎందుకు అంటే తను కథకు పాత్రకు సంబంధం ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుని సినిమాలు చేస్తుంది.
ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాల్లె చెబుతాయి, సినిమాల్లోని తన పాత్రకు ఎంత వేల్యూ ఉంటుందో, సాయి పల్లవి ఇటివల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది.దర్శకులు ఎంతో మంది నా వద్దకు కథలను చెప్పడానికి వచ్చేవారు కాని అన్నింటికీ నేను ఒకే చెప్పలేను ఎందుకు అంటే వారు చెప్పే కథలు నా పాత్రకు సినిమాకు అసలు సంబంధం లేని పాత్రలు చెబుతుంటారు అలాంటి వారి సినిమాల్లో నేను నటించను.
ఎందుకంటే నేను ఎన్ని సినిమాల్లో నటించాను అనేది నాకు ముఖ్యం కాదు, సినిమా చూసే ప్రేక్షకులు నా పాత్రను నన్ను ఎంత మంది ఇష్ట పడుతారు అనేది నాకు ముఖ్యం.కమర్షియల్ సినిమాల్లో నటిస్తే డబ్బు, పేరు వస్తాయి కాని, ఏ ఒక్క హీరోయిన్ అయిన కమర్షియల్ సినిమాల్లో ఎక్కువకాలం రాణించలేదు అనేది నా అభిప్రాయం.
అందుకే కమర్షియల్ పాత్రలకు నేను చాలా దూరం ఉంటాను.కథకు సంబంధం ఉండే పాత్రలు వస్తేనే నేను సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.సాయి పల్లవి తెలుగు,తమిళం, మలయాళం లో నటిస్తూ ఉన్నది.ప్రస్తుతం శేకర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య తో లవ్ స్టొరీ అనే సినిమాలో నటిస్తుంది.