మలయాళ హిట్ మూవీ అత్రిన్ ను తెలుగులో అనుకోని అథితిగా 2019లో తీసుకు రావాలనుకున్నారు.కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.2020 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకుంటే కరోనా కారణంగా వాయిదా పడింది.ఎట్టకేలకు థియేటర్ల రిలీజ్ కష్టం అనే నిర్ణయానికి వచ్చిన నిర్మాతలు ఆహా ద్వారా స్ట్రీమింగ్ చేశాడు.
నేడు రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతున్న అనుకోని అతిథి సినిమా ఎలా ఉంది ఏంటీ అంటూ చాలా మంది సోషల్ మీడియా లో రివ్యూలు అడుగుతున్నారు.ఈ సినిమాలో పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.
మరి ఆ అంచనాలు తగ్గట్లుగా ఉందా అంటే తెలుగు వారి అభిరుచికి తగ్గట్లుగా లేదు అని మాత్రం చెప్పవచ్చు.
తెలుగు వారి సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ మెండుగా ఉండాలి.
కథ లేకున్నా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే జాతి రత్నాలు సినిమాలో కోర్టు సన్నివేశంలా సూపర్ హిట్ అవుతుంది.కాని అనుకోని అతిథి సినిమాలో మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు.
కేవలం ట్విస్ట్ లు టర్నింగ్ లు మాత్రమే ఉన్నాయి.మలయాళం సినిమాలు అంటే కాస్త కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ అంటూ ఉంటారు.
అన్నట్లుగానే ఈ సినిమా కూడా కంటెంట్ ఓరియంటెడ్ మూవీ.సాయి పల్లవి నటన మరియు ఫాహద్ ఫాజిల్ మార్క్ నటన సినిమా లో ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి.
కథ చాలా డిఫరెంట్ గా ఉంది.తెలుగు దర్శకులు కనీసం ఇలాంటి కథను టచ్ చేసేందుకు కూడా భయపడే పాయింట్.
మన హీరోలు ఎందుకులే అనుకుంటూ పక్కకు తప్పుకునే ప్రాజెక్ట్.ఇలాంటి సినిమా ను ఆధరించే వారు అభిమానించే వారు కొందరు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్నారు.
వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.కాని అందరికి మాత్రం ఈ సినిమా ఎక్కుతుందని చెప్పలేం.