రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ ఓ చిత్రాని రూపొందించనున్న సంగతి అందరికి తెలిసిందే.పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రం ఉండనున్నది.
ఈ చిత్రాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు శిరీష్ లు తమ సొంత బ్యానర్ అయిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.ప్రస్తుతం శంకర్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ హీరోగా ఇండియన్ చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 ను చిత్రీకరిస్తున్నాడు.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రాకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ ఏడాది చివరికల్ల ఈ చిత్రం విడుదల అవ్వుతుంది.తాజాగా సమాచారం మేరకు ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్ర మాటలు, డైలాగ్ లు అందించనున్నాడు అని తెలుస్తుంది.
తెలుగులో చాలా సూపర్ హిట్టు చిత్రాలకు డైలాగులు రాశాడు.కృష్ణం వన్డే జగద్గురు, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, కంచె, గోపాల గోపాల,ఇటీవల సూపర్ హిట్టు అయిన రవి తేజ చిత్రం క్రాక్ కు కూడా సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్నాడు.
ప్రస్తుతం రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ కు డైలాగులు రాస్తున్నాడు.అలాగే శర్వానంద్ శ్రీకారం, పవన్ కళ్యాణ్, రానా సినిమాకు మాటలు అందిస్తున్నాడు.ఇలా వరస హిట్స్ చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా పనిచేసిన సాయి మాధవ్ బుర్ర రామ్ చరణ్, శంకర్ సినిమాకు పనిచేయడం అనేది సినిమాపై వేరే లెవల్ ను తీసుకుపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.పదునైన మాటలు, డైలాగులు, సున్నితమైన ప్రేమ పాటలు రాయడంలో అయిన దిట్ట.
ఈ చిత్రం తెలుగు, తమిళంలో తో పాటుగా కన్నడ, హింది, మలయాళ బాషల్లో విడుదల అవ్వనున్నది.రామ్ చరణ్ సినిమా విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తో పాటుగా ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు.