పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబో మూవీ అనగానే అంచనాలు భారీగా వచ్చాయి.ఆ అంచనాలను మరింత పెంచేలా ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లు ఫస్ట్ లుక్ మరియు వీడియో ఉన్నాయి అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా కు ఉన్న అంచనాలు ఆకాశమే హద్దు అనడంలో సందేహం లేదు.అంతటి క్రేజ్ ను కలిగి ఉన్న హరి హర వీరమల్లు సినిమా స్థాయిని స్టార్ డమ్ ను అంచనాలను మరింతగా పెంచేందుకు గాను చిత్ర యూనిట్ సభ్యులు ఆసక్తికర విషయాన్ని వెళ్లడించారు.
అదే ఈ సినిమా కు మాటలను సాయి మాధవ్ బుర్రా అందిస్తున్నాడు.ఈమద్య కాలంలో సాయి మాధవ్ బుర్రా అందిస్తున్న మాటలు ఏ రేంజ్ లో ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
క్రిష్ గత చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి కి సాయి మాధవ్ బుర్రా డైలాగ్ లు ఇస్తున్నాడు.అలాగే సాయి మాధవ్ బుర్రా ఆర్ ఆర్ ఆర్ సినిమా కు కూడా వర్క్ చేస్తున్నాడు.ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ డైలాగ్ రైటర్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో సాయి మాధవ్ పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అలాంటి సాయి మాధవ్ బుర్ర ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమాకు వర్క్ చేస్తున్నాడు అనడంలో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ ను జులై లేదా ఆగస్టు వరకు పూర్తి చేయబోతున్నారు.భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఉంటుంది కనుక సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయబోతున్నారు.
ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.